ఎర్రగుట్ట ప్రాంత పొలాల్లోచిరుత సంచారం----చేనులో కట్టి వేసిన కుక్కను చిరుత ఎత్తుకు వెళ్ళినట్లు అనుమానం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు.( టీవీ 17 న్యూస్)
జూలూరుపాడు ఏన్కూరు సరిహద్దు ప్రాంతమైనఎర్రగుట్ట సమీపంలో ఉన్న పొలాల్లో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు .అయితే భీమ్లాతండాకు చెందిన భూక్య మాన్సింగ్ తన పొలంలో కోతుల బారి నుండి పొలాన్ని కాపాడేందుకు ఓ కుక్కను పొలం వద్దకు తీసుకువెళుతుంటాడు ఈ క్రమంలో శనివారం రాత్రి కుక్కను పొలంలో వదిలేసి వచ్చానని ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్ళగా కుక్కను ఏదో అడవి జంతువు గుట్ట పైకి ఈడ్చుకు వెళ్ళినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు . జూలూరుపాడు ఏన్కూరు అటవీ ప్రాంతాలు కావడం ఎర్రగుట్ట సమీపంలో రైతులకు పొలాలు ఉండడం పొలాల్లో చిరుత సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు రైతులు పొలాల్లో కొన్ని పాదముద్రలను గుర్తించారు అవి చిరుతపులి అడుగులా, పెద్దపులి అడుగులా అనేవి అటవీ శాఖ వారు నిర్ధారించాల్సి ఉంది. ఏదేమైనా పొలాల్లో చిరుత సంచరిస్తుందని అనుమానంతో ఒంటి గుడిస,బద్రు భీమ్లా తండా పరిసర ప్రాంత రైతులు ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment