ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అలనాటి జ్ఞాపకాలు అపూర్వం.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అలనాటి జ్ఞాపకాలు అపూర్వం.


ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అలనాటి జ్ఞాపకాలు అపూర్వం. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం( టీవీ 17 న్యూస్) పడమట నర్సాపురంలోని వశిష్ట ప్రైవేట్ పాఠశాలలో 2004 -05 సంవత్సరం కాలంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు 20 సంవత్సరాల తర్వాత వారు చదువుకున్న వశిష్ట హైస్కూల్లో కలుసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు పాఠశాలలోని తరగతి గదులను కలియతిరిగారు. లోన మాచినపేట మాజీ సర్పంచ్ కుమారుడు సపావట్ నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. వారి గురువులైన వశిష్ట స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు,  నాగరాజు ,రాజకుమారిలను ఘనంగా సన్మానించారు. వశిష్ట పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు చాలామంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని. గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు లక్ష్మీనారాయణ, పెద్ద జాను, చిన్న జాను, సేవియా ,నాగేంద్రబాబు ,మహేష్, నరేష్ ,నరసింహారావు ,రాధా, రాధిక మృదులత, శ్వేత, శారదా, త్రివేణిలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.