హైడొస్ ఉపయోగంపైRMPలకు DM&HOవార్నింగ్. కిడ్నీ బాధితులను పరామర్శ ఆహరపు అలవాట్లపై ఆరా.

 

హైడొస్ ఉపయోగంపైRMPలకు DM&HOవార్నింగ్. కిడ్నీ బాధితులను పరామర్శ ఆహరపు అలవాట్లపై ఆరా.


హైడొస్ ఉపయోగంపైRMPలకు DM&HOవార్నింగ్. కిడ్నీ బాధితులను పరామర్శ ఆహరపు అలవాట్లపై ఆరా.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 20 టీవీ 17 న్యూస్ 

ఇటీవల అనంతారం గ్రామంలో కిడ్నీ బాధితులు ఎక్కువ కావడంతో గ్రామస్తులు ఆందోళన మొదలైన విషయం తెలిసిందే ఈ విషయంపై మీడియా ఫోకస్ పెట్టడంతో యంత్రాంగం లో కదలిక వచ్చి గ్రామంలో కిడ్నీ బాధితులు ఎందుకు పెరుగుతున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇటీవల జిల్లా అధికారుల ఆదేశంతో గ్రామంలో రక్త నమూనాల ను తీయించి పరీక్షలకు పంపించారు అదేవిధంగా గ్రామంలో మంచి నీటిని కూడా శాంపిల్స్ తీయించి ల్యాబ్ కు పంపారు అయితే మిగతా కారణాలు ఆల్కహాల్ కంజంక్షన్ ఆహారపు అలవాట్లు అదేవిధంగా ఆర్ఎంపీల దగ్గర హైడోస్ వైద్యం తీసుకున్న వారిపై కూడా ఆరా తీస్తున్నారు అయితే శుక్రవారం జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ అనంతరం గ్రామాన్ని సందర్శించి కిడ్నీ బాధితుల ఇండ్లకు వెళ్లి రిపోర్ట్స్ ను పరిశీలించారు వారి ఆహారపు అలవాట్లను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ వైద్యులకు హెచ్చరిక చేశారు పేషెంట్లకు హైడొస్ మందులు ఉపయోగించవద్దని మందులు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ వైద్యులు వెంకటేశ్వర్లను ఆర్ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మాంసాహారం ఆల్కహాల్ అలవాట్లను తగ్గించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఇటీవల బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ప్రశ్నించగా రిపోర్ట్స్ లో నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా డయాలసిస్ బెడ్లను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు

Blogger ఆధారితం.