అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు.రాజీనామా చేయాలని డిమాండ్.
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు.రాజీనామా చేయాలని డిమాండ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేల్పుల నరసింహారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానుభావుడు వల్లే భారత రాజ్యాంగం రూపొందించబడిందని, అందులో ఉన్న చట్టాలు శాసనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని , ప్రతి ఒక పౌరుడుస్వేచ్ఛగాబతుకుతున్నారంటే ఆయన బిక్షే అని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో నర్వనేని పుల్లారావు, కొల్లిపాక వెంకటేశ్వర్లు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, ఇల్లంగి సుందర్ రావు, బోడ నాగరాజు, దాసరి నాగయ్య, ఇడుపుల రాజు, సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు గోపాల్ రావు గారు, పూర్ణయ్య, కత్తి గోపి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment