మరికొన్ని గంటల్లో రిసెప్షన్. అంతలోనే నవ వరుడు మృతి. శోకసముద్రంలో ఈరు కుటుంబాలు.
మరికొన్ని గంటల్లో రిసెప్షన్. అంతలోనే నవ వరుడు మృతి. శోకసముద్రంలో ఈరు కుటుంబాలు.
మే20 tv 17 న్యూస్.
మరి కొంచెం సేపట్లో రిసెప్షన్ ఉండగా.. కరెంట్ షాక్ తో పెళ్ళి కొడుకు మృతిచెందిన ఘటన బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలో కోడిపుంజుల తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ నరేష్ వివాహం సోమవారం విజయవాడలో ఘనంగా జరిగింది.
పెళ్ళి అనంతరం వధూవరులు కోడిపుంజుల తండా చేరుకున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. మరి కొద్దిగంటల్లో ఆనందంగా కార్యక్రమం ప్రారంభం కానుంది. పెళ్ళికొడుకు నీళ్ళ కోసం కరెంట్ మోటార్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
Post a Comment