బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి పొంగులేటి.
బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మంత్రి పొంగులేటి.
స్థానికంగా ఉండని అధికారులపై ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 3 (టీవీ17 న్యూస్)
మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి, కలెక్టర్ జితేష్ పాటిల్ తో కలిసి పడమట నరసాపురంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు వంటశాలను పరిశీలించారు.
వడ్డించటానికి సిద్ధంగా ఉన్న అన్నను పరిశీలించారు తరగతి గదుల్లో కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు అనంతరం అధికారులతో కూరగాయలు నాణ్యత. వంట తయారు చేయడంలో శుభ్రతలు తదితర విషయాలపై ఆరా తీశారు భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్థానికంగా ఉండని కొందరి అధికారులను ఆయన మందలించారు.
వారంలో ఒకసారి హాస్టలను సందర్శించాల్సిందిగా స్థానిక తహసీల్దారు నుఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఉన్నారు.
Post a Comment