ఉప్పల కుంట చెరువును పరిశీలించిన ,DE కిషోర్
ఉప్పల కుంట చెరువును పరిశీలించిన ,DE కిషోర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు( టీవీ 17 న్యూస్) మండలకేంద్రంలో ఉన్న ఉప్పల కుంట చెరువు (ఎర్ర చెరువు)ను జూలూరుపాడు ఏన్కూర్ మండలాల ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ కిషోర్ గురువారం పరిశీలించారు.
గ్రీవెన్స్ డే లో మాల మహానాడు జూలూరుపాడు మండలం కమిటీ ఉప్పల కుంట చెరువు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో గురువారం DE పరిశీలించారు. గుండెపుడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్లు 60, 69 లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందని అట్టి చెరువును చుట్టుపక్కల ఆక్రమించారని ఫిర్యాదు అందడం తో పరిశీలకు వచ్చినట్లు చెప్పారు త్వరలోనే రెవిన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని సర్వే చేయిస్తామని ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. రైతులకు ఉపయోగపడే చెరువులను ఆక్రమిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఇల్లంగి తిరపతి. మండల అధ్యక్షుడు బుడిబుడి ప్రభాకర్, పోతురాజు రామారావు. పణీతి వెంకటేశ్వర్లు కల్లోజు రవికాంత్, బుడిబుడి ప్రతాప్, మైకు శ్రీను పప్పుల నరసింహారావు, ఇల్లంగి సుందర్ రావు ,పత్తిపాటి యోహాన్. లు ఉన్నారు
Post a Comment