అవి చిరుత పులి పాద ముద్రికలే రైతులు ఎవరు భయాందోళనకు గురికావద్దు. అటవీ అధికారులు

 

అవి చిరుత పులి పాద ముద్రికలే రైతులు ఎవరు భయాందోళనకు గురికావద్దు. అటవీ అధికారులు

అవి చిరుత పులి పాద ముద్రికలే రైతులు ఎవరు భయాందోళనకు గురికావద్దు. అటవీ అధికారులు

 జూలూరుపాడు (టీవీ 17 న్యూస్ )ఎఫెక్ట్. 

ఆదివారం జూలూరుపాడు ఏన్కూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఎర్రగుట్ట సమీపంలో రైతుకు చెందిన కుక్కను అటవీ జంతువు ఈడ్చుకు వెళ్లిందని చిరుతపులే అనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేయడంతో స్పందించిన జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు.

తన సిబ్బందితో కలిసి సోమవారం ఎర్రగుట్ట ప్రాంతంలో ఉన్న పొలాల్లో ఉన్న పాద ముద్రికలను పరిశీలించగా అవి చిరుత పులి పాదముద్రికలతో పోలి ఉన్నాయని కుక్కని కూడా గుట్టపైకి ఈడ్చికి వెళ్ళినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నందున ఈ విషయాన్ని జిల్లా అటవీ ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.

 అటు తల్లాడ రేంజ్ అటవీ అధికారులను ఇటు జూలూరుపాడు అటవీ రేంజ్ అధికారులను అలర్ట్ చేసినట్లు చెప్పారు .ఈ విషయమై రైతుల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాత్రి సమయాలలో కొన్ని రోజులు పొలాల వద్దకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని గ్రామంలో చాటింపు కూడా వేయిస్తున్నట్లు చెప్పారు. 

తల్లాడ ,జూలూరుపాడు అటవీ రేంజ్ అధికారులు వారం రోజులు పాటు ఎర్రగుట్ట పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటారని చెప్పారు. ఒకవేళ చిరుత పులి కనిపిస్తే అటవీ అధికారులకు తెలియజేయాలన్నారు .

Blogger ఆధారితం.