అధికారులు సొంత ఎజెండాతో పనిచేయవద్ధు.ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వార్నింగ్.

 

అధికారులు సొంత ఎజెండాతో పనిచేయవద్ధు.ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వార్నింగ్.


అధికారులు సొంత ఎజెండాతో పనిచేయవద్ధు.ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వార్నింగ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు(TV17 న్యూస్) మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 20 మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు మరియు 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు ఇటీవల తుఫానుల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయదారులను సైతం ఆదుకుంటుందని ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. 

ఈ సందర్భంగా కారేపల్లి మండలానికి చెందిన యువ శాస్త్రవేత్త చనిపోవడం చాలా బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. రుణమాఫీ కి సంబంధించి రైతుల్లో ఎలాంటి అపోహలు వద్దని  చిన్న సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని అలాంటివారి కూడా రుణమాఫీ అయ్యేవిధంగా అధికారులు అసరా త్తులుచేస్తున్నారని ముగ్గురు మంత్రులు నిరంతరం కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారని ఉన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొందరు అధికారులు సొంత ఎజెండాతో పని చేస్తున్నారని అలాంటి వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.

 ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా అధికారులు పనిచేయాలే తప్ప సొంత ఎజెండాలను ఉపయోగిస్తే సహించబోమని అన్నారు. అవసరమైతే తమ ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చన్నారు . కార్యక్రమంలో తాసిల్దార్ స్వాతి బిందు. ఎండిఓ కరుణాకర్ రెడ్డి ఎఫ్ ఆర్ వో ప్రసాద్ రావు. 

ఏఐ సతీష్ నాయకులు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి దుద్దుకూరు మధుసూదన్ రావు రామ్ శెట్టి రాంబాబు రొకటి సురేష్. వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.