80 లక్షల విలువగల 256 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు.కారు ద్విచక్ర వాహనం సీజ్ ఇద్దరు అరెస్ట్.

80 లక్షల విలువగల 256 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు.కారు ద్విచక్ర వాహనం సీజ్ ఇద్దరు అరెస్ట్.


80 లక్షల విలువగల 256 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు.కారు ద్విచక్ర వాహనం సీజ్ ఇద్దరు అరెస్ట్.

వివరాలు  వెల్లడించిన DSP.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు (టీవీ 17 న్యూస్) జూలూరుపాడు.సమీపంలో సిసిఎస్ పోలీసులు మరియు జూలూరుపాడు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 256 కేజీల గంజాయిని తరలిస్తున్న కారు మరియు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వివరాలను కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో  వెల్లడించారు. కారులో హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు గంజాయిని తరలిస్తున్న శివ శంకర్ రెడ్డి నాగేంద్రబాబులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని పట్టుకున్న గంజాయి వేల సుమారు 80 లక్షల వరకు ఉంటుందని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు గంజాయిని పట్టుకున్న జూలూరుపాడు ఎస్సై రానాప్రతాప్ మరియు టాస్క్ ఫోర్స్ సిఐ రామాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ లను ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారని వారికి రివార్డులను ప్రకటించారని డి.ఎస్.పితెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు గంజాయిని ఎవరు ఉపయోగించిన అమ్మిన అమ్మడానికి సహకరించిన ఎవరినీ ఉపేక్షించబోమని గంజాయి రహిత తెలంగాణను తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడుపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Blogger ఆధారితం.