పేదవాడికి అండ ఎర్రజెండా.ప్రజా ఉద్యమాలే సిపిఐ అజెండాభారత్ లో ఎర్ర జెండాకు వందేళ్లు పూర్తి.


పేదవాడికి అండ ఎర్రజెండా.ప్రజా ఉద్యమాలే సిపిఐ అజెండాభారత్ లో ఎర్ర జెండాకు వందేళ్లు పూర్తి. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 26 ప్రజా జ్యోతి. మండల కేంద్రంలో సిపిఐ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో సిపిఐ శ్రేణులుఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై సిపిఐ పతాకాన్ని  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు  ఈ సందర్భంగా  మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు. 

దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్‌ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రజాకార్ల, భూస్వాముల, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్‌ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 100 ఏండ్ల సుధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుండి  పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు,,

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, aiyf జిల్లా కార్యదర్శి sk నాగుల్ మీరా, సిపిఐ నాయకులు, ఎల్లంకి మధు సొసైటీ డైరెక్టర్ కల్లోజి రజిని  గా ర్లపాటి వీరభద్రం, సిరిపురపు వెంకటేశ్వర్లు  తూము కోటయ్య పొన్నెకంటి వెంకటేశ్వర్లు, వ ల్ల మల్ల సామేలు, గుండే పిన్ని మధు, కొండ వీరయ్య యాస రోశయ్య sk చాంద్ పాషా బడుగు వీరస్వామి  చి మట ముత్తయ్య సుబ్బెన సూర్యం,  కంచర్ల రాజు  ఎల్లంకి శీను తాత నరసింహారావు,పాలెపు ప్రభాకర్, గార్లపాటి శివకృష్ణ, నిమ్మటూరి లచ్చయ్య, పత్తిపాటి మహేష్, కొట్టే శ్రీను,,  సటు రామారావుబరగడ రమేష్  పసుపులేటి పవన్, బర్ల ప్రేమమ్మ  ఇల్లంగి ఆంథోని, శీలం సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.