మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.గ్యాస్ ధర పెంపునకు నిరసన గా...
మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.గ్యాస్ ధర పెంపునకు నిరసన గా...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టీవీ 17 న్యూస్
గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ CPIML మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు జాటొత్ కృష్ణ ఆధ్వర్యంలొ మండల కేంద్రంలో మోడీ మదిష్టిబొమ్మను దగ్ధం చేసే నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ఉపాధి కూలీలకు ఏడు రూపాయలు పెంచినట్టే పెంచి, గ్యాస్ ధర పెంచి 50 రూపాయలు పేద రైతులు వ్యవసాయ కూలీల పై భారం మోపడం దురదృష్టకరమని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపటం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి మూలిగేనక్క పై తాటికాయ పడ్డ చందాన కేంద్ర ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
ధరను పెంపుదలను నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్టు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బానొత్ ధర్మ, ఎదులాలాపురం గోపాలరావు ,రాయలసిద్దు, నరేష్ పాల్గొన్నారు.
Post a Comment