తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన జూలూరుపాడు జర్నలిస్టు సోదరులు.
తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన జూలూరుపాడు జర్నలిస్టు సోదరులు.
*అధికారుల వద్దకు జర్నలిస్టులు సమస్యలు*
పరిష్కరించాలని వినతి పత్రాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ఉన్నతాధికారులు తాసిల్దార్ మరియు ఎంపీడీవోలకు సోమవారం జూలూరుపాడు మండల వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సంఘ సభ్యులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు.
ఎన్నో ఏండ్లుగా జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, సొంత ఇండ్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలు కలలుగానే మిగిలిపోయాయి. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలనీ వినతి పత్రంలో పేర్కొన్నారు అందుకు అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
ఇంటి స్థలం ఉన్నవారికైనా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పూర్ణచంద్రరావు మోదుగు ప్రభాకర్ బండ్ల వెంకట్ షేక్ సిద్ధిఖీ, సౌడం వెంకటేశ్వర్లు ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ మోదుగు ఆదం భూక్య రత్నకుమార్ పాల్గొన్నారు.
Post a Comment