డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. సిపిఐ పార్టీ నిరసన, వినతిపత్రం.
డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. సిపిఐ పార్టీ నిరసన, వినతిపత్రం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 21 టీవీ 17 న్యూస్ జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళ పాడు పడమట నర్సాపురం పెద్ద హరిజనవాడ పాపకొల్లు తో పాటు అనంతరం గ్రామాలలో కిడ్ని సమస్యలు బాధితులు పెరగడంతో డయాలసిస్ చేయించుకోవాలంటే దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని శనివారం సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు డయాలసిస్ సెంటర్ ని కిడ్నీ బాధితుల అవసర నిమిత్తం ఏర్పాటు చేయాలని దూరప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలంటే స్లాట్ బుక్ చేసిన రోజుల తరబడి అక్కడ డయాలసిస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం చొరవ తీసుకొని డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అదేవిధంగా పిహెచ్సి ని సి హెచ్ సి గా అప్గ్రేట్ త్వరగా చేయాల్సిన అవసరం ఉందనిడిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్, గుండె పిన్ని వెంకటేశ్వర్లు. షేక్ నాగుల్ మేర షేక్ చాంద్ పాషా రాజు లచ్చయ్య వీరస్వామి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment