పాము కాటుకు కోళ్లు మృతి.కోళ్ల గూటిలోకి దూరిన పాము.



పాము కాటుకు  కోళ్లు మృతి.కోళ్ల గూటిలోకి దూరిన పాము.

పాము కాటుకు  కోళ్లు మృతి.కోళ్ల గూటిలోకి దూరిన పాము.

 __భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నవంబర్ 6 (టీవీ 17 న్యూస్) మండల పరిధిలోని నంద తండా గ్రామపంచాయతీ బృందావన్ కాలనీకీ చెందిన ఓ వ్యక్తి జాతి కోళ్లను పెంచుకుంటున్నాడు. వాటికోసం ఓ గూటిని ఏర్పాటు చేసుకొని పగలు సమయంలో కోళ్లను బయటకు వదిలి రాత్రి సమయాలలో కోళ్ల గూట్లో ఉంచుతాడు ఈ క్రమంలో రాత్రి సమయంలో గూటిలోకి దూరిన పాము మూడు కోళ్లను కాటు వేసింది. గూటిలో ఉన్న కొన్ని కోడిగుడ్లను సైతం పాము తినేసింది కోళ్ల గూటి వద్దకు వెళ్లిన యజమాని మృతి చెందిన కోళ్లను చూసి పరిశీలిస్తుండగా కోళ్ల గూటిలో బుస కొడుతూ పాము కనిపించింది. స్థానికుల సహాయంతో యజమాని పామును చంపారు. కోళ్ల పెంపకం దారులు కోళ్ల గూళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలని. పాములు గూళ్ళల్లోకి దూరే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్త వహించాలంటున్నారు వేలల్లో ఆయజమానికి నష్టం జరిగింది.__

Blogger ఆధారితం.